Friday, September 4, 2026

మేడ్చల్–రాయిలాపూర్ నూతన రహదారికి మంజూరు

📰 Generate e-Paper Clip

మేడ్చల్: మేడ్చల్ రైల్వే బ్రిడ్జి నుంచి రాయిలాపూర్ వరకు నూతన రహదారి నిర్మాణానికి మంజూరు లభించింది. ఏళ్లుగా ఈ రహదారి కోసం ఎదురుచూస్తున్న మేడ్చల్–రాయిలాపూర్ ప్రాంత ప్రజలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.

ఈ నూతన రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి, రహదారి నిర్మాణానికి మంజూరు తీసుకురావడంలో చొరవ చూపిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్కు మేడ్చల్ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు ముందడుగు పడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొంటున్నారు.

మేడ్చల్–రాయిలాపూర్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న ఈ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమై, నిర్ణీత సమయంలో పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

 

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.