Friday, September 4, 2026

పట్టాలపై ఆడుకుంటున్న చిన్నారి.. కాపాడబోయిన తల్లి.. ఇద్దరి ప్రాణాలు బలి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న రెండేళ్ల కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి.. రైలు ఢీకొనడంతో చిన్నారితో కలిసి మృతి చెందింది.

ఈ ఘటన ఫలక్‌నుమా–బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అనూష (23), ఆమె రెండేళ్ల కుమారుడు త్రినాథ్‌గా గుర్తించారు.

చిన్నారి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో అతడిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.