పట్టాలపై ఆడుకుంటున్న చిన్నారి.. కాపాడబోయిన తల్లి.. ఇద్దరి ప్రాణాలు బలి

హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న రెండేళ్ల కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి.. రైలు ఢీకొనడంతో చిన్నారితో కలిసి మృతి చెందింది. ఈ ఘటన ఫలక్‌నుమా–బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అనూష (23), ఆమె రెండేళ్ల కుమారుడు త్రినాథ్‌గా గుర్తించారు. చిన్నారి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో అతడిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న...