మేడ్చల్లో రాజీవ్గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
మేడ్చల్: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్ 297వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దేశ ప్రధానమంత్రిగా రాజీవ్గాంధీ చేసిన సేవలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అనేక కీలక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు.
సాంకేతిక, విద్యా, సమాచార రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్గాంధీ పునాదులు వేశారని నాగరాజు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొని రాజీవ్గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.


