మేడ్చల్ హౌసింగ్ బోర్డ్–లైబ్రరీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు.. బీజేపీ పోరాటానికి ఫలితం: నాయకులు

Date:

📰 Generate e-Paper Clip

మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

గిర్మాపూర్ బీజేపీ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పలుమార్లు అధికారులతో మాట్లాడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.

ఏప్రిల్ 13న ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించిన వినతిపత్రం అనంతరం అధికారులు సానుకూలంగా స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించారు.

ఈ అభివృద్ధి పనులను కొందరు కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని బీజేపీ నాయకులు విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వారి పాత్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు.

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, పారిశుద్ధ్యం వంటి ప్రతి ప్రజా సమస్యపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

“ప్రజల కోసం ప్రశ్నిస్తాం.. ప్రజల కోసం పోరాడతాం.. శాశ్వత పరిష్కారం సాధించే వరకు వెనక్కి తగ్గం” అని బండి విష్ణు గౌడ్, శ్రీపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

TG: లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు

లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి తనపై...

ఢిల్లీ ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ

ఢిల్లీలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని...

పార్లమెంట్ ముట్టడికి యత్నం.. నిరసనకారులపై రాళ్లు విసిరిన పోలీసుల వీడియో వైరల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం CJP కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం...
App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.