ఎర్నాకులం: కుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కేరళ పోలీసులను ఆశ్రయించారు. తనకు తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ ఎర్నాకులంలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆదివారం తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మోనాలిసా, తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
తండ్రిపై ఆరోపణలు
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన మోనాలిసా, తన తండ్రి తన పాస్పోర్ట్, డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తన ప్రాణానికి ముప్పు ఉందని పేర్కొంటూ పోలీసుల రక్షణ కోరారు.
పోలీసుల స్పందన
మోనాలిసా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమె చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



