హైదరాబాద్ బోడుప్పల్లోని నిమిషాంబికా దేవి ఆలయం భక్తుల విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ముఖ్యంగా అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, వివిధ సమస్యలతో సతమతమవుతున్నవారు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.
అంతేకాదు.. కోరుకున్న కోరిక 21 రోజుల్లో నెరవేరుతుందని భక్తుల్లో ప్రచారం ఉంది. కోరిక నెరవేరిన అనంతరం అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా చెబుతున్నారు.
అయితే ఇవన్నీ భక్తుల విశ్వాసాలు మాత్రమే. ఆలయానికి వచ్చే భక్తులు తమ ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం అమ్మవారిని దర్శించుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి అరుదైన ఆలయాల విశేషాలను తెలుసుకోవాలంటే **ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ‘Hidden Secrets of Telugu Temples’**ను చూడండి.