అక్రమ ఎల్పీజీ రీఫిల్లింగ్ కేంద్రంపై ఎస్ఓటీ దాడి
ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామం ఘన్పూర్ ఎక్స్రోడ్ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఎల్పీజీ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై మేడ్చల్ ఎస్ఓటీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు.
ఈ దాడిలో విజయేందర్ గుప్తా, సన్నీ గుప్తా, మనీష్ గుప్తా, విశాల్ గుప్తాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని రాజేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడి సందర్భంగా పెద్ద సంఖ్యలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో పాటు ఏజిస్ ప్యూర్గ్యాస్కు చెందిన 15 కిలోల సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్కు వినియోగిస్తున్న పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.