PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 1:09 pm Posted by : Pradeep Medchal Reporter 🗞️

మేడ్చల్ పాలిటెక్నిక్‌ను ‘శక్తి’లో కలపొద్దు.. విద్యార్థుల భారీ ధర్నా.

మేడ్చల్ పాలిటెక్నిక్ కాలేజీని ‘శక్తి’లో విలీనం చేయకూడదని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కాలేజీని యథాతథంగా కొనసాగించాలని, విలీనం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థుల ధర్నాతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భవిష్యత్తుపై ప్రభావం పడే నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.