వేణుస్వామి సంచలన జోస్యం.. పలు రాష్ట్రాల్లో సీఎం మార్పులు?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పలు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై సంచలన అంచనాలు చేశారు. 2026 సెప్టెంబర్‌ నుంచి మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ముఖ్యమంత్రుల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆరోగ్య కారణాలతో పదవిని కోల్పోయే అవకాశం ఉందని వేణుస్వామి పేర్కొన్నారు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని ఆయన అంచనా వేశారు. అదే సమయంలో నవంబర్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కొని పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగి...