భారత్-ఆఫ్ఘన్ టీ20 సిరీస్.. టీవీ హక్కులు సోనీకి!

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ టీవీ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం ఫ్యాన్‌కోడ్ వద్దే ఉన్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే సెప్టెంబర్ 14న వినాయక చవితి నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాలని ఐటీడబ్ల్యూ యూనివర్స్ ఏసీబీని కోరింది. దీనిపై ఏసీబీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.