PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 1:08 pm Posted by : News Desk

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు?.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్తి

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు?.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్త హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రభుత్వంలో వ్యక్తిగత పెత్తనం ఉండకూడదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 

యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకాల విషయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మహేష్‌కుమార్‌గౌడ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 

ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఇతర శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు బోనాల సందర్భంగా జరిగిన ఓ విందులో రేవంత్‌రెడ్డికి మహేష్‌కుమార్‌గౌడ్ హెచ్చరిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

అయితే ఈ పరిణామాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.