Breaking : పవన్ కల్యాణ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు |
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కార్డియాక్ సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ను వైద్యులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.