ఢిల్లీలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్య, పరీక్షా వ్యవస్థలపై యువత తీవ్ర అసంతృప్తితో నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు.

విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న రాహుల్ గాంధీ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని మోదీ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువత ఆందోళనలను అణచివేయడం కాకుండా, వారి సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.