న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం CJP కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనలో కొందరు పోలీసులు నిరసనకారులపై రాళ్లు విసురుతున్నట్లు కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చట్టం-శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.